telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ఏపీ బడ్జెట్ నుంచి ఖర్చు చేయం: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని ఏపీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

దీనికి అనుగుణంగా రాజధాని అమరావతిలో ల్యాండ్ మోనిటైజేషన్ పాలసీకి సీఆర్డీఏ శ్రీకారం చుట్టనుంది.

తొలిదశ రాజధాని పరిధిలోని 4 వేల ఎకరాలను ఆ జాబితాలోకి తీసుకురానుంది. ఈ భూములను ఎకరం రూ. 20 కోట్లకు విక్రయించడం ద్వారా రూ. 80 వేల కోట్లు సమీకరించనుంది.

ఈ నిధులను రెండు సంస్థల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తోంది.

అలాగే రాజధానిలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరతను కూడా వీటితో సమర్థవంతంగా అధిగమించవచ్చునని అంచనా వేస్తోంది

Related posts