telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గోపీచంద్ కొత్త సినిమా పోస్టర్ విడుదల…

దర్శకుడు మారుతి దాసరి ప్రతి రోజు పండగే సినిమాతో భారీ హిట్ అందుకుని తన సత్తా చాటాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించాలని మారుతి అనుకున్నాడు. కానీ కరోనా రావడంతో అతడి సినిమా వెనక్కి వెళ్లింది. అయితే లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత మారుతి తన సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకోసం గోపీచంద్‌ను కలిసాడు మారుతి. కథ నచ్చడంతో గోపీ చంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు పక్కా కమర్షిషల్‌ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే.. తాజాగా ఇవాళ దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చేసింది. కాగా…ప్రస్తుతం గోపీచంద్ తన నూతన సినిమా సీటీమార్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా విడుదలైన తరువాత మారుతి సినిమాలో జాయిన్‌ కానున్నాడు. మార్చి 5 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని తెలిపారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts