telugu navyamedia
సినిమా వార్తలు

“రంగస్థలం” మిస్సయినందుకు బాధగా ఉంది : అనుపమ పరమేశ్వరన్

Anupama-Parameshwaran

అనుపమ నటించిన “రాక్షసుడు” సినిమా తర్వాలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా నటించాడు. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘రాట్‌ససన్’ చిత్రం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం అనుపమ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రంగస్థలం” సినిమాలో అవకాశం చేజార్చుకున్నందుకు బాధపడింది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ హీరోగా డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం “రంగ‌స్థ‌లం”. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను అనుకున్నారు. అయితే ఆ త‌ర్వాత అనుప‌మ‌ను త‌ప్పించి స‌మంత‌ను తీసుకున్నారు. ఆ సినిమా అవ‌కాశం కోల్పోవ‌డం గురించి తాజాగా అనుప‌మ మాట్లాడింది. “రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` మిస్సయినందుకు చాలా బాధ‌గా ఉంటుంది. అది చాలా మంచి సినిమా. ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం నాకే వ‌చ్చింది. డేట్లు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల చేయ‌లేక‌పోయా. అయితే సినిమా చూసిన త‌ర్వాత మాత్రం నేను చేయ‌డం కంటే స‌మంత చేయ‌డ‌మే మంచిద‌నిపించింది. రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా నటించారు” అని అనుప‌మ చెప్పుకొచ్చింది.

Related posts