కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో జనతా కర్ఫ్యూ పాటించమని పిలుపునిచ్చింది. ఆదివారం దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ప్రజలంతా ఇళ్లలోనే సూచించాలని సూచించింది. దీనిపై మెగాస్టార్ స్పందించారు. మోదీ జనతా కర్ఫ్యూకు మద్దతిస్తూ ఆయన వీడియో పోస్టు చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మనమంతా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిద్దామన్నారు. ఇళ్లకే పరిమితం అవుదామన్నారు. భారతీయులుగా మనమంతా ఐక్యమత్యంతో నిలబడి ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొందామన్నారు చిరంజీవి. సామాజిక సంఘీభావం పలుకుదామన్నారు. కరోనా విముక్తి భారతం పొందుదామన్నారు. జైహింద్ అంటూ తన వీడియోలో ప్రసంగాన్ని ముగించారు మెగాస్టార్. మరోవైపు అనేకమంది సినీ ప్రముఖులు ప్రధాని మోదీ పిలుపుతో జనతా కర్ఫ్యూకు మద్దతు ఇస్తున్నారు.
Mega Star Chiranjeevi garu requests us to participate in #JanataCurfew and appreciate the efforts being put in by the officials. pic.twitter.com/xaV9sLJrKB
— Konidela Pro Company (@KonidelaPro) March 21, 2020