telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్ఆర్ఏ పెంపు, జీవో జారీ

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న‌ హెచ్ఓడి కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. .

అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ చెందిన పెంపు కాదని తెలుస్తోంది. ఎవ‌రైతే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల ఉద్యోగులకు మొన్నటి వరకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేవారు. 

అయితే ఇప్పుడు తాజాగా వ‌చ్చిన‌ పీఆర్సీలో 8 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సదరు హెచ్‌వోడీ కార్యాలయాలు విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో వుండటంతో వీరికి 8 శాతం హెచ్ఆర్ఏ వర్తించనుంది. అయితే వీరికి 16 శాతం హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Related posts