telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మర్డర్’ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాతకు నల్గొండ జిల్లా సివిల్ కోర్టు నోటీసులు

murder

వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్‌’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ కథ ఆధారంగా ‘మర్డర్’ సినిమాను దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అనే పాటను సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అమృత ప్రణయ్ సహా కుటుంబ సభ్యులు స్పందించారు. ‘మర్డర్’ సినిమా చిత్రీకరణను ఆపాలంటూ ప్రణయ్ భార్య అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి, ఇలాంటి సమయంలో కల్పిత కథతో ఉన్న ఈ సినిమా విడుదలైతే సాక్ష్యులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని, కాబట్టి సినిమా చిత్రీకరణను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అమృత ఆ పిటిషన్‌లో కోరారు. అమృత దాఖలు చేసిన సివిల్ దావాను విచారించిన కోర్టు ప్రతివాదులైన దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా నిన్న నోటీసులు జారీ చేసినట్టు అమృత తరపు న్యాయవాది తెలిపారు.

Related posts