telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి పనులు నిలిపివేయడం వల్ల 20 వేల మంది రోడ్డున పడ్డారు : పవన్ కల్యాణ్

Pawan-Kalyan

రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడం వల్ల దాదాపు 20 వేల మంది ఉపాధి కోల్పోయారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసే క్రమంలో ప్రజలు నష్టపోరాదని అన్నారు. గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప ప్రాజెక్టులను మొత్తానికే నిలిపివేయడం సరికాదనిసూచించారు.

చిల్లర రాజకీయాల మూలంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని, ముందు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు పవన్ పేర్కొన్నారు.

Related posts