telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శరద్‌ పవార్‌తో ముగిసిన చంద్రబాబు సమావేశం

Chandrababu meet NCP sharad pawar

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నాయకులను కలుస్తున్నారు. నిన్న పలువురు నేతలను కలుసుకున్న చంద్రబాబు ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మరోసారి సమావేశమై నిన్నటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు కొనసాగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

శనివారం రాహుల్‌, అఖిలేష్‌, మాయావతిలో కలిసి జరిపిన చర్చల సారాంశాన్ని పవార్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. విపక్ష కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మాయావతి, అఖిలేష్‌ సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని వివరించి ఈనెల 21, 22 తేదీల్లో విపక్ష కూటమి భేటీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం సోనియాగాంధీతో భేటీ అనంతరం అమరావతికి చంద్రబాబు రానున్నారు.

Related posts