telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం: ఉత్తమ్

T Congress boycott mlc elections

పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఉత్తమ్ పాల్గొన్నారు. కలెక్టర్ కు ఉత్తమ్ వినతిపత్రం సమర్పించారు.

అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ పది లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. .ఇంటర్ ఫలితాల విషయంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఆతమహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Related posts