హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్ద జరిగిన ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈవెంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరం అని అన్నారు. ఫ్యాన్స్ మీట్కు వచ్చిన నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది.. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలియజేస్తున్నారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
కాగా..అల్లు అర్జున్తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో అభిమాన హీరోకోసం వేచిచూశారు.. అయితే, ఫొటో సెషన్ లేదని చెప్పడంతో ..ఆగ్రహంతో ఊగి పోయిన అభిమానులు గేట్లను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ సంఘటనపై అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా స్పందించారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.