మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఫేమ్ దేవా కట్టా డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు.ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్స్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
తాజాగా తాజాగా ఈ సినిమా నుంచి “రిపబ్లిక్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ లో సాయి ధరమ్ తేజ్, రమ్య కృష్ణ పోషించిన పాత్రల మధ్య రాజ యుద్ధాన్ని కన్పిస్తోంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశారు.
‘యాజ్ పెర్ కాన్సిటిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే .. ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మరిచిపోయినట్టున్నావ్’ అని రమ్యకృష్ణ అంటే.. ‘యాజ్ పెర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశం మారణహోమానికి దారితీస్తే .. ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్లవుతారు’ అని సాయిధరమ్ కౌంటర్ ఇవ్వడం ఇందులో ప్రధాన హైలైట్.
‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’, ‘మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు’, ‘గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’ లాంటి దేవ్ కట్టా మార్క్ డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ చేరడం పక్కా అనిపిస్తోంది.
కాగా ..ట్రైలర్ ను విడుదల చేసిన చిరు.. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’ అంటూ.. ట్వీట్ కూడా చేశారు.