నటుడు నితిన్ తాజా చిత్రం `భీష్మ`. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం ఉదయం పది గంటలకు విడుదల చేయబో్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు.
2018లో రెండు సినిమాలు చేసిన నితిన్, 2019లో సినిమాలేవీ చేయలేదు. దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ముందుగా `భీష్మ` విడుదల కానుంది.