ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ, నీలు షాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ శుభకార్యానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ పెళ్ళికి సంబంధించి గ్రాండ్ రిసెప్షన్ వేడుకను అల్లు ఫ్యామిలీ నిర్వహించారు. ఈ వేడుకకు మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, బన్నీ, శిరీష్, వరుణ్ తేజ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాబీ రిసెప్షన్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. జూన్ 21న హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో నిరాడంబంరంగా ఈ పెళ్ళి జరిగింది. బాబీ శ్రీమతి నీలు షాది ముంబై కాగా, ఆమె హైదరాబాద్లో సెటిలైంది. పుణేలోని సింబయాసిస్ నుండి ఎంబీఏ పూర్తి చేసిన నీలు ..తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. వీరిరివురిది ప్రేమ వివాహం అని అంటున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా పలు కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారట. వారికి ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఇక బాబీ త్వరలో నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
previous post
next post