telugu navyamedia
సినిమా వార్తలు

సెట్స్ పైకి మణిరత్నం సినిమా

Mani-Rathnam

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇప్పుడు “వాన‌మ్ కొట్టాటుమ్” అనే ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. నేటి చిత్ర షూటింగ్ మొద‌లు కానుంద‌ని తాజాగా ప్రకటించారు. విక్ర‌మ్ ప్ర‌భు, ఐశ్వ‌ర్య రాజేష్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ‌ణిర‌త్నం నిర్మించ‌డ‌మే కాకుండా కో రైట‌ర్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు. ధ‌న‌శేఖ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం ఖాయ‌మని ధీమా వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక మణిరత్నం క‌ల‌ల ప్రాజెక్ట్ “పొన్నియిన్‌ సెల్వన్‌” పుస్తకం ఆధారంగా తెర‌కెక్క‌నున్న చిత్రాన్నికూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు మ‌ణి. ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు లాంటి స్టార్ హీరో హీరోయిన్లు నటించనున్నారు. మ‌రోవైపు త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ మ‌ద్రాస్ టాకీస్ బేన‌ర్‌పై ప‌లు సినిమాలు నిర్మిస్తున్నాడు.

Related posts