ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టుక్రికెట్లో న్యూజిలాండ్ బౌలర్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటతీరుతో 150 పరుగులు నమోదుచేశారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా పదివికెట్లను… న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ కే నమోదు కావడం గమనించదగ్గవిషయం.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, అక్షర పటేల్ ముగ్గురూ ఎల్బీడబల్యూగా పెవీలియన్ బాటపట్టగా…. చతేశ్వరపూజారా, రవిచంద్రన్ అశ్విన్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. ఇలా టీమిండియా బ్యాట్స్ మెన్లను పెవీలియన్ పంపించడంలో అజాజ్ పటేల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశారని క్రికెట్ విశ్లేషకులనుంచి అభినందనలు అందుకున్నాడు.