telugu navyamedia
క్రీడలు వార్తలు

స్మిత్ నిజంగా పెద్ద వికెట్ : అశ్విన్

ఆసీస్ తో మ్యాచ్ ఆడటం మరోసారి అరంగేట్రం చేసినట్లు అనిపించింది అని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. అయితే ప్రస్తుతం భారత్-ఆసీస్ పింక్ టెస్ట్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్  మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్ ను 191 పరుగులకే కట్టడి చేసి 53 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే ఆసీస్ ను కట్టడి చేయడంలో అశ్విన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో స్మిత్ తో సహా మొత్తం 4 వికెట్లు తీసాడు. ఇక రెండో రోజు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ… కరోనా లాక్ డౌన్ తర్వాత ఆడటం నాకు మళ్ళీ క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తున్నట్లు అనిపించింది. పింక్-బాల్ టెస్ట్ లో ఆడుతున్న ఫీలింగ్ చాలా బాగుంది. స్మిత్ వికెట్ నిజంగా పెద్దది అని అశ్విన్ చెప్పాడు. అయితే రెండో రోజు ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ లో 36 పరుగులకే ఆల్ ఔట్ అయింది భారత జట్టు. దాంతో ఈ మ్యాచ్ లో దాదాపు ఆసీస్ విజయం ఖాయం అయినట్లు కనిపిస్తుంది.

Related posts