మొదటి పెళ్లిని గోప్యంగా ఉంచి గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకోవాలని ప్రయత్నించిన ఓ ప్రబుద్ధుడి భరతం పట్టారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తికి మొదట వివాహమైంది. గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లి చేసుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వధువు బంధువులు నిత్య పెళ్లి కొడుకును బంధించారు.
గతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన యువతితో రాజశేఖర్కు మొదటి వివాహమైంది. జగిత్యాల జిల్లా పోరండ్ల అమ్మాయితో రెండో వివాహానికి సిద్ధపడ్డారు. మొదటి భార్య నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలంటూ వధువు బంధువుల ఆందోళనకు దిగారు నిత్య పెళ్లి కొడుకుపై వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్