సంజయ్ దత్, పూజా భట్ జంటగా 1991లో మహేశ్భట్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సడక్’. దానికి సీక్వెల్గా సంజయ్ దత్, ఆదిత్యా రాయ్ కపూర్, పూజా భట్, ఆలియా భట్ ప్రధాన తారలుగా ‘సడక్ 2’ తెరకెక్కింది. 20 ఏళ్ల తర్వాత మహేశ్భట్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 28న డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. బుధవారం ఉదయం ట్రైలర్ విడుదల కాగా, సాయంత్రానికి 25 లక్షల మందికి (2.5 మిలియన్) పైగా దీనిని డిస్ లైక్ చేశారు. సినిమా చూడొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్ కింద ఈ సినిమాను విమర్శిస్తూ “జస్టిస్ ఫర్ సుశాంత్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంధుప్రీతి కారణంగానే సుశాంత్ మరణించాడని కొందరు ఆరోపణలు చేయడంతో సల్మాన్, అలియా, మహేష్ భట్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ వంటి బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా సంచలన విమర్శలు చేశారు. చాలామంది వారిని అన్ ఫాలో కూడా చేశారు. అంతేకాదు వారికి సంబంధించిన సినిమాల విషయంలోను నెటిజన్లు ఇలాగే ప్రవర్తిస్తుండడం గమనార్హం.
previous post
next post