టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, గల్లాజయదేవ్ అక్కడికి చేరుకున్నారు. మహేశ్ని కలిసి, కాసేపు సరదాగా ముచ్చటించారు. సోషల్ మీడియా వేదికగా ఆ విశేషాల్ని పంచుకున్నారు.
‘మహేశ్బాబు ఇప్పుడే తన సినిమాలోని విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం. మహేశ్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. శశిథరూర్తోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం కార్యక్రమాల్లో భాగంగా శశిథరూర్ ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.
విడాకులు తీసుకోవటం వలన బతికిపోయా… భార్యపై సంపత్ కామెంట్స్