telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

రామతీర్ధంలోని రాముల వారి రగడ…

రామతీర్ధంలోని రాముల వారి రగడ ముదురుతోంది. అయితే రామతీర్ధంలోని బొదికొండపై రాముల వారి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆ మరుసటి రోజు ఆలయం పక్కనే ఉన్న కోనేరులో రాములవారి విగ్రహం తల లభించింది.  ఈ కేసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే, అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆలయంలోని కోనేరులో నీటిని తోడేందుకు మోటార్లు ఇచ్చారని, రాములవారి ఆలయంలో జరిగే అన్ని రకాల వేడుకల్లో ఆ వ్యక్తి పాల్గొనేవారని, రాములవారి సేవలో ఉన్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీతో పాటుగా, అనుమానిత వ్యక్తికి సంబందించిన కుటుంబసభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు.  వెంటనే వ్యక్తిని విడుదల చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని అనుమానితుని భార్య అంటోంది.   ఇక ఇప్పటికే రామతీర్ధంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు టెంట్లు వేశాయి.  వైసీపీ కూడా పోటీగా టెంటు వేసేందుకు సిద్ధం అయ్యింది.  రామతీర్ధం దేవాలయాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు రామతీర్ధం వెళ్తున్నారు.  అటు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా రామతీర్ధం వెళ్తున్నారు.

Related posts