telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ వార్తల వల్ల కాపురాలు కూలిపోయాయి : అక్షయ్ కుమార్

Akshay-Kumar

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తాజాగా “గుడ్ న్యూస్” అనే కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కరీనా కపూర్, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్జీత్ దొసాన్జ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలో కరీనా అక్షయ్ కుమార్ భార్యగా… కియారా, దిల్జీత్ భార్యగా కనిపించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 డిసెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అక్షయ్ మాట్లాడుతూ “లిమిటెడ్ బడ్జెట్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. మంచి కాన్సె్ప్ట్ ఉన్నప్పుడు లిమిటెడ్ బడ్జెట్‌తో తీస్తే లాభాలు వస్తాయి. ఇప్పుడు నేను నటించిన ‘గుడ్ న్యూ్స్’ సినిమాను 37 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే పుడుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్నవారికి ఐవీఎఫ్ ఓ వరం. కానీ ఈ పద్ధతి గురించి తెలీనివారు చాలా మంది ఉన్నారు. మా సినిమా ద్వారా ఆ పద్ధతి గురించి ఫన్నీగా చెప్పాలని అనుకుంటున్నాం. ఇక దర్శకుల్లో ఉన్న నైపుణ్యాన్నే నేను చూస్తాను. నేను ఎక్కువగా కొత్త దర్శకులతోనే పని చేస్తాను. ఎందుకంటే పెద్ద దర్శకులు నాతో కలిసి పని చేయరు. నేను 20 మంది దర్శకులతో కలిసి పని చేశాను. అనుభవం ఉన్న డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసినా కూడా రిస్క్ ఉంటుందని తెలిసింది. కొందరైతే ఏదన్నా కొత్తగా ప్రయత్నిద్దామని ఆలోచించింది కూడా లేదు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలు రాయకూడదు. కొన్ని సార్లు అవే తప్పుడు వార్తలు కొందరి జీవితాలను, కెరీర్‌ను నాశనం చేస్తుంటాయి. అలాంటి తప్పుడు వార్తల వల్ల నా కళ్లముందే ఎన్నో కాపురాలు కూలిపోయాయి. అందరూ తప్పుడు వార్తలే రాస్తారని నేను అనడంలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts