ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై ఒక్క పరుగు తేడాతో ముంబై గెలుపొందిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హీరో సిద్ధార్థ్, అజిత్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది. దీంతో చాలా మంది ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ట్విటర్ ద్వారా విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సిద్ధార్థ్ ట్విటర్ ద్వారా స్పందించారు. “ముందు నోర్మూసుకుని గేమ్ను గౌరవించండి. ఈ రోజు జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ లేదు. ఇరు జట్ల ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మనల్ని ఎంటర్టైన్ చేశారు” అని సమాధానం ఇచ్చాడు. ఇక అజిత్ ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్న ఓ అభిమాని కూడా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సిద్ధార్థ్ “మీరు నిజంగా అజిత్ అభిమాని అయితే ఇతరుల హార్డ్ వర్క్ను గుర్తించండి. లేకపోతే అలాంటి వ్యక్తిని రోల్ మోడల్గా ఎంచుకోవడం నిరుపయోగం” అని సిద్ధార్థ్ రిప్లై ఇచ్చాడు. దీంతో అజిత్ అభిమానులు సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
next post