సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
వినాయగం ‘నాట్యాచార్య పద్మశ్రీ’ వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడు. 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం.. తన మామయ్య, గాయకుడు సీఎస్ జయరామన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ‘దిల్’ (2001) అనే తమిళ చిత్రంతో ‘కన్నుకుల్లా కెలుతి’ పాటతో చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ‘తిరుద తిరుది’ అనే సినిమాలో ధనుష్ తండ్రిగా నటించారు. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. ఇవే కాకుండా వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు.
తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.
కాగా.. సోమవారం అడయార్లోని వినాయగం నివాసంలో గాయకుడికి అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.
మంచు లక్ష్మి బీర్ తాగుతూ రోడ్డులో… బిడ్డను కనడానికి కూడా ఇబ్బందే పాపం… రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు