ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారు. అయితే.. ఆ హీరోయిన్ల కోసం మొదట సాయిపల్లవి, ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారట. ఇందులో ఐశ్వర్య రాజేష్ ఫైనల్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఐశ్వర్య రాజేష్.. రానాకు జోడిగా నటించనుందట. ఇక పవన్ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఇంకో హీరోయిన్ కోసం నిర్మాత తెగ కష్టపడుతున్నాడట. త్వరలోనే ఇంకో హీరోయిన్ కూడా ఫైనల్ కాబోతుందని సమాచారం.
previous post
next post
కంగనా ఘాటు వ్యాఖ్యలు… సమాధానం చెప్పిన రణబీర్