టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి పేర్ని నాని. తనను ఓడించినందుకు చంద్రబాబు ప్రజల మీద తన అక్కసు అంతా వెళ్ళగక్కాడని.. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును హెరిటేజ్ లో పాలు, పిడకలు అమ్మినట్లు రాసుకున్న విషయం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు? పేర్ని నాని పేర్కొన్నారు. హెరిటేజ్ లో పాపం కంపు వస్తుందని.. అమరావతి పేరుతో ప్రజల నుంచి భూములు లాక్కుంది చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ఏ మోహం పెట్టుకుని విజయవాడ, గుంటూరులో ఓట్లు అడగటానికి వచ్చారు? నిలదీశారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం అంటే నాకు ప్రేమ అంటాడని… చంద్రబాబుకు అధికారం అంటే ప్రేమ అని ఎద్దేవా చేశారు. 2019లో ప్రజలు వదిలేశారు… 2021లో కార్యకర్తలు కూడా చంద్రబాబును వదిలేసే పరిస్థితి వచ్చిందన్నారు. సైకిల్ డిప్పలు కొట్టేసే వ్యక్తులను పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నాడని.. అమ్మవారు కళ్ళు తెరవబట్టే చంద్రబాబుకు ఈ గతి పట్టిందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో ప్రజలను మోసం, దగా చేశారని… హైదరాబాద్ లో ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి అర్థరాత్రి పారిపోయి వచ్చారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సొల్లుగాడని…చంద్రబాబు మాయగాడని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ముసలి రౌడీ.. పవన్ కళ్యాణ్ మాటల రౌడీ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సొల్లు మాటలకు అలవాటు పడ్డాడని..సినిమాల్లో మొదటి రోజు డబ్బులు వచ్చినట్లే ఎన్నికలు అనగానే వసూళ్లు చేసుకుంటాడని చురకలు అంటించారు. బీజేపీ సంకనెక్కిన పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏమి చేశాడని.. ఢిల్లీ వెళ్లి వచ్చి ఏమి చేశారని నిలదీశారు.