టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంత ..ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్న చై..సామ్ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే దంపతులు విడిపోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ వార్తలపై సమంత కానీ, అక్కినేని కుటుంబం కానీ స్పందించలేదు.
ఇటీవల తన ఇంటి పేరు అక్కినేనిని సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తీసేయడం, సోషల్ మీడియాలో సమంత బాధాకర పోస్టులు పెట్టడం, చైతన్య లేకుండానే హాలిడే వెకేషన్స్ కి వెళ్ళటం, నాగచైతన్య లవ్ స్టోరీ మూవీపై సాయి పల్లవిని పొగిడి చైతు మాట ఎత్తకపోవటం, ఇప్పడు భర్త లేకుండానే ఒంటరిగా శ్రీవారి సన్నిధికి రావటం.. మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
ఈ క్రమంలోనే షాకింగ్ ఇన్సిడెంట్ తిరుమలలో చోటుచేసుకుంది. ఓ మీడియా విలేకిరి అడిగిన ప్రశ్నకి జవాబివ్వకుండా సమంత ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇక శనివారం సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆమె స్వీకరించారు.
ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న ఆమె, తర్వాత స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం తరపున వేద పండితులు మంత్రోఛ్చరణలతో ఆశీర్వదించి తీర్థ – ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య-సమంత విషయంలో వస్తున్న రూమర్స్పై ఓ మీడియా రిపోర్టర్ ప్రశ్నించగా సామ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘గుడికి వచ్చి బుద్ధి ఉందా..’ అంటూ తీవ్ర స్థాయిలో కోప్పడ్డారు. . దాంతో అవాక్కయిన విలేకరి నుండి నోటా మాట రాలేదు. విలేఖరికి కౌంటర్ ఇస్తూనే సీరియస్ గా అక్కడినుండి వెళ్ళిపోయింది సమంత.
నిజంగా సమంతకు చైతూతో గొడవలు లేకుంటే, మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉంటారు. ఖచ్చితంగా ఒక స్పష్టత ఇచ్చేవారు అంటున్నారు నెటిజన్స్.
ఏం చూసుకుని మగాడ్నని ఫీల్ అవుతున్నాడో… మాధవీలత ఫైర్