“సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” చిత్రాలతో ఈ ఏడాది మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప”లో నటిస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.లాక్డౌన్ మొదలైన నాటి నుండి బెంగళూరులోని తన ఇంట్లో ఉంటోంది. కరోనా వల్ల ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన ఈ భామ ఇప్పుడు షూటింగ్లకు మాత్రం రెడీ అంటోంది. ఈ సమయంలో మీరు షూటింగ్కు రెడీగా వున్నారా..? అని ఈ అమ్మడిని ప్రశ్నిస్తే ‘నా దర్శక, నిర్మాతలు షూటింగ్కు రమ్మని అంటే తప్పకుండా వస్తాను. తగు జాగ్రత్తలు పాటిస్తూ నేను చిత్రీకరణలో పాల్గొంటాను” అంటూ చెప్పుకొచ్చింది .
previous post
next post