ప్రస్తుతం సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త తగ్గింది. బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో చివరగా నాగార్జున సరసన ‘మన్మథుడు2’ సినిమాలో నటించింది. కమల్ సరసన ‘భారతీయుడు2’లో అవకాశం దక్కించుకున్నప్పటికీ… లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అయితే అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పై ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఛిట్ఛాట్ చేస్తోంది. తాజాగా అభిమానులతో టచ్లోకి వచ్చిన రకుల్.. వారడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. `మీ తొలిప్రేమ గురించి చెప్పండి..` అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. `నేను ఇప్పటివరకు ప్రేమలో పడలేదు. ప్రేమలో పడేందుకు ఎదురు చూస్తున్నా` అని చెప్పింది. అలాగే `ఒకవేళ మీ ప్రియుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలిస్తే మీరేం చేస్తారు` అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రకుల్.. `అతను నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడో తెలుసుకుంటాను. ఒక బంధంలో మోసానికి చోటు ఉండకూడదు. అందుకే అతన్ని వదిలేస్తాను` అని చెప్పింది. అలాగే `పర్ఫెక్ట్ కిస్` గురించి సమాధానమిస్తూ.. “దాన్ని మాటల్లో వర్ణించలేం. అనుభవించాల్సిందే” అంటూ చెప్పుకొచ్చింది.
previous post
రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు