telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవి నా ఆయుష్షును ఉంచవేమో… హీరోయిన్ వ్యాఖ్యలు

Madhavilatha

టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత “నచ్చావులే” సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఈ నటి, బీజేపీ యువ నాయకురాలు చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవీలత పోస్టుపై నెటిజన్లు పెద్ద మొత్తంలో స్పందిస్తున్నారు. “నేనెపుడు నా ఫ్రెండ్సుతో చెప్తూ ఉంటాను. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిల చచ్చిపోతా అని. అందులో కూడా తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా పోతది నేను అంతేనేమో. ఎపుడు నన్ను ఏడిపించే 3 విషయాలు.. మైగ్రేన్ తలనొప్పి, జలుబు-జ్వరం, నిద్రలేమి. వీటికోసం మందులు.. మందులంటే నాకు అసహ్యం. కలలున్నాయి కోరికలున్నాయి ఆశలున్నాయి. ఈ మందులు నా ఆయుష్షు ఉంచవేమో. చిన్న సమస్యలు కానీ ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తోంది. ఈ కారణంగా నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ నా విషయంలో అది సరికాదు” అని మాధవీలత పోస్టులో పేర్కొంది.

Related posts