telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాకరేపుతున్న అతిలోక సుందరి వారసురాలు!

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. 2018లో ‘థడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్… ఈ మూడేళ్ళలో ఏ మీడియంనూ వదిలిపెట్టలేదు. ‘ఘోస్ట్ స్టోరీస్’ ఆంథాలజీలో నటించిన జాన్వీ కపూర్… ఆ తర్వాత చేసిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ఆమె మూడో సినిమా ‘రూహీ’ డైరెక్ట్ గా థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ తరహాలోనే సాగే ఈ హారర్ మూవీపై దర్శక నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఆ స్థాయిలో సినిమా వసూళ్ళు లేకపోయినా ‘రూహీ’ ఫర్వాలేదనిపిస్తోంది. బహుశా వాటిని పెంచేందుకే కావచ్చు… జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా యూత్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఎర్రటి లాంగ్ గౌన్ వేసుకుని, పిక్కలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి ‘వసంత కాలపు చెర్రీస్’ అనే కాప్షన్ పెట్టడం విశేషం. ఎర్రని పెదాలతో పాటు యెద అందాలను ప్రదర్శనకు పెట్టిన జాన్వీ ‘రూహీ’ సినిమాలోనూ ఇంత అందంగా కనిపిస్తుందని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. 

Related posts