నటుడు ఉత్తేజ్.. తన నటనతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. అతను మాటలతో, స్పీచ్లతో అందరినీ ఆకట్టుకుంటాడు. మంచి మంచి పాత్రాలు చేస్తూ నటుడిగా కంటిన్యూ అవుతున్నారు ఉత్తేజ్.
నువ్వు సరిగ్గా తినట్లేదయ్యా..నువ్వు తింటేనే నాకు తృప్తి..ఇంటికెళదాం..పండుగ చేసుకుందాం..! నాన్నా..నిన్ను వదిలి వెళ్ళిపోతానేమోనని ఏడుపొస్తోంది..(పద్మ)
ఇదిలా ఉంటే ఇటీవల ఆయన సతీమణి పద్మ క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. భార్య తన నుంచి దూరమై పోవడంతో ఉత్తేజ్ ఆమె స్మృతుల్లో గడిపేస్తున్నారు. నేడు ఉత్తేజ్ సతీమణి పద్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన తన భార్యను తలుచోకొని భావోద్వేగానికి గురయ్యారు.
“పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన ప్రతిఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు.