telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ హౌజ్ లో షాకింగ్ ఘటన… లేడీ కంటెస్టెంట్ కు అరెస్ట్ వారెంట్ జారీ…!?

Amisha

బద్రి, నాని వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అమీషా పటేల్ ఆ తర్వాత నిర్మాతగా మారింది. “దేశీ మ్యూజిక్” పేరుతో ఓ సినిమాను నిర్మించింది. 2013లో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. కాగా… సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్‌బాస్ హిందీ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌మేట్స్‌లో బాలివుడ్ నటి అమీషా పాటిల్ కూడా ఉండటంతో ఈ సీజన్ పై అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా అమీషా పాటిల్‌పై రాంచీ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్‌కు రూ.3 కోట్లు ఎగ్గొట్టినందుకుగానూ అమీషా పాటిల్‌పై న్యాయస్థానం ఆశ్రయించగా, అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ఇదిలా ఉంటే అమీషా పాటిల్‌తో పాటు ఆమె బిజినెస్ పార్ట్‌నర్ కునాల్ కలిసి “దేశీ మ్యాజిక్” సినిమా నిర్మాణం కోసం రూ.2.50 కోట్లు రుణం తీసుకోగా, వడ్డీతో కలిసి ఆ మొత్తం రూ.3 కోట్లకు చేరింది. అయితే రుణం తిరిగి చెల్లించే సమయంలో అమీషా పాటిల్ ఇచ్చిన రూ.3 కోట్ల చెక్ ఇవ్వగా, అది బౌన్స్ అయ్యింది. దీంతో లీగల్ నోటిస్ ఇచ్చినప్పటికీ అమీషా పాటిల్ స్పందించలేదు. ఇక చేసేదేమి లేక కోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.

Related posts