టాలీవుడ్ లెజండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో చేరిన సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పిటల్ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిరోజూ రెండు పూటలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా? లేదా? ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది? వంటి అవకాశాల గురించి డాక్టర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తాను మాట్లాడిన తర్వాత థమ్సప్ చూపించారని కూడా ముందుగా చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కైకాల సత్యనారాయణ కుటుంబానికి అన్ని తానే అపోలో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతూ కైకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెబుతున్నారు. అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కష్ట సమయంలో తమకు ఇంతలా ఒక అండగా నిలబడి చిరంజీవికి కైకాల కుటుంబ సభ్యులు ఋణపడి ఉంటారంటున్నారు.
అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కూడా చినబాబుకు ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.
రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం : నమిత హాట్ కామెంట్స్