ఇటీవలే “ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఓ మిస్టికల్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ దగ్గర పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పోస్టర్ను సాయితేజ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. `కొత్త జోనర్ సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు సుకుమార్ భాగస్వామ్యంలో చేయడం మరింత ప్రత్యేకం. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న నా 15వ సినిమా ఓ మిస్టికల్ థ్రిల్లర్` అని సాయితేజ్ ట్వీట్ చేశాడు.
Trying a new genre is always exciting. That too in association with one of my favorite movie maker Sukumar garu makes it all the more special. #SDT15 is a mystical thriller produced by @SVCCofficial and @SukumarWritings Directed by @karthikdandu86 pic.twitter.com/lBP8entrls
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 14, 2020