నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ అలరిస్తోంది. తమన్ సంగీతంలో ఎస్పీ చరణ్, ఎమ్ ఎల్ శృతి ఈ పాటను పాడారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు అందమైన బాణీలు రాశారు.
దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవర్పుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా హిట్టే. ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ లు నటిస్తుండగా.. హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ ఫస్ట్ సాంగ్ లో.. బాలకృష్ణ మరియు ప్రగ్యా జైస్వాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ అందరినీ కనివిందు చేస్తున్నాయి. ఇందులో బాలయ్య.. స్టైలీస్ లుక్ లో కనిపించారు. ఈ వీడియో సాంగ్ తో సినిమా పై బాలయ్య అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
కాగా..’అఖండ’ తర్వాత బాలయ్య మరో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథతో సితార సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం పక్కా పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ఉంటుందని.. ఇందులో బాలయ్య ఎమోషనల్ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.