మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్న రామ్చరణ్ రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడడంతో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’కు లైన్ క్లియర్ అయింది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక చెర్రీ సరసన హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్, కియార ఆడ్వాణీ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరిలో ఎవరో ఒకరు చెర్రీ సరసన కనిపించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.
previous post
కత్రినాకు నేను మేరీ జాన్… సల్మాన్ వ్యాఖ్యలు