telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ! : విజయసాయిరెడ్డి మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ట్విట్టర్‌ వేదికగా ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు, అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు. “ఏంటి అచ్చెన్నా…నిమ్మాడ అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా? మీరు డిక్టేట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ!” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అంతకు ముందు ట్వీట్‌లో “ప్రజా మద్దతుతో 4 సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయింది. అందుకే నిమ్మగడ్డ యాప్. ఎలక్షన్ కమిషన్ యాప్ ఉండగా ఈ సీక్రెట్ యాప్ ఏంటి? దీని కంట్రోల్ రూం టీడీపీ ఆఫీసులో పెట్టారా? చంద్రబాబును, చినబాబును నువ్వు జాకీలేసినా లేపలేవు నిమ్మగడ్డా?” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. 

Related posts