తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టిన అందాల తార ఛార్మి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలకు తోడు చక్కటి నటనతో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరమయ్యారు.
తెర మీద కనిపించడం మానేసినా.. సినిమా పరిశ్రమలో కొనసాగారు. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారి, సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. ‘పూరి కనెక్ట్స్‘ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీరిద్దరు కలిపి నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగావిజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది.
ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తా. అప్పటి వరకు బతకండి, బతకనివ్వండి” అని ప్రకటించారు.
మరోవైపు, ‘లైగర్’ ఫ్లాప్తో విజయ్, ఇతర చిత్రబృందాన్ని నిందిస్తూ పలువురు నెటిజన్లు సోషల్మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఛార్మి, పూరీ కనెక్ట్స్ని ట్యాగ్ చేస్తూ.. సినిమా అసలేం బాలేదంటూ. కథ, కథనంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేశారు. ఛార్మిని సైతం నిందించారు. ఈ చిత్రానికి పూరీ డైరెక్ట్ చేయలేదని.. ఛార్మి చేసిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఛార్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022
రామ్ గోపాల్ వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని కానీ : గాయత్రీ గుప్త