telugu navyamedia
రాజకీయ వార్తలు

దామచర్లను కలిసిన ఏ.కే.యూ. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. అంజిరెడ్డి – సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జనార్ధన్…

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు శాసన సభ్యునిగా విజయం సాధించిన దామచర్ల.జనార్ధన్ ను ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ మారెడ్డి. అంజిరెడ్డి శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జనార్ధన్ తో కరచాలనం చేసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన ఎమ్మెల్యే జనార్ధన్ ను ఉప కులపతి ప్రొఫెసర్ అంజి రెడ్డి, ఏకేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు తదితరులు బొకే ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అంజి రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, విజయ భారతి బి.ఎడ్. కళాశాల కరస్పాండెంట్ చంద్ర తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts