ఏపీ ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు. జనసేన కూటమి అటు అసెంబ్లీలో ఇటు లోక్ సభలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దు. పవన్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. రాష్ట్ర విభజన అనంతరం సరైన న్యాయం జరగకపోవటంతో అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. అంటూ నేడు విశాఖలో మాయావతి మీడియాతో అన్నారు.
బిఎస్పి తో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. దళితుని సీఎం చేస్తానన్న వాగ్దానంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యింది. కానీ అక్కడి నాయకత్వం దానిని విస్మరించింది. మాయావతి ప్రధాని కావాలని చాలా మంది కోరుతున్నారు.. అంటూ పవన్ మీడియాతో మాట్లాడారు.
వీరిరువురు నేడు విశాఖలో ఉమ్మడి ప్రచారంలో భాగంగా కలుసుకున్నారు. నేడు, రేపు జనసేన తమ మద్దతు దార్లతో పలు బహిరంగ సభలద్వారా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు మాయావతి విశాఖకు వచ్చారు. జనసేన ఇప్పటికే మాయావతి, సిపిఐ పార్టీలతో పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.
సోనూసూద్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు