telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ స్కూళ్లపై కరోనా పంజా…120 మంది టీచర్లకు పాజిటివ్‌

కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఆ పాఠశాలలో 117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..పది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఆ విద్యార్థులను ఇంటికి పంపించేసింది పాఠశాల యాజమాన్యం. విద్యార్థులనే కాదు…టీచర్లను వణికిస్తోంది ఈ మహమ్మారి కరోనా. తాజాగా చిత్తూరు జిల్లా ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 120 మంది టీచర్లకు కరోనా సోకగా..నలుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఏపీలో నవంబర్‌ 2న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే…ప్రారంభమైన మొదటి రోజే నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఆ జిల్లాలోని మర్రిపాడు మండలంలోని నందవరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నలుగురికి కరోనా సోకింది. అంతేకాదు..మోడల్‌ స్కూల్‌ వాచ్‌ మెన్‌కు అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఏపీలో ఇలా కేసులు విజృంభిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts