అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కంటే ప్రచారంలో తానే ముందున్నానని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రచార హోరుకు కాస్త బ్రేక్పడింది. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు.
విధినిర్వహణలో భాగంగా ఆమె నిత్యం ట్రంప్ వెంటే ఉంటుంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ క్వారంటైన్లోకి వెళ్లారు. తాము కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ట్రంప్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఎన్నిరోజులపాటు ఐసోలేషన్లో ఉంటాననే విషయాన్ని తెలపలేదు. హోప్ హిక్స్కు కరోనా లక్షణాలు కనిపిండచంతో పరీక్షలు చేయించామని ఆమెకు పాజిటివ్ వచ్చిందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.