‘ఫిదా’సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. ఆ తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య పక్కన ‘లవ్స్టోరీ’లో నటిస్తోంది సాయిపల్లవి. తాజాగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా సాయిపల్లవిని మెయిన్ హీరోయిన్గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. గతంలో సాయిపల్లవి ‘ఎంసీఏ’ సినిమాలో నానికి జోడిగా నటించింది.
previous post
పద్దతిగా ఉండడం నేర్చుకోండి… ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో తొడలు కనిపించేలా… : లోబో