సినీ గేయ రచయితగా భాస్కరబట్ల రవికుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే తాజాగా భాస్కరబట్ల తల్లి విజయలక్ష్మీ తుది స్వసా విడిచారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోమవారం రాత్రి ఆమె మరణించగా, మంగళవారం ఇన్నీసుపేట కైలాసభూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు విజయలక్ష్మీకి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇక భాస్కరబట్ల టాలీవుడ్ లో ప్రేమగీతాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారారు.
next post