ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం “రాజుగారిగది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగది 3”. యువ హీరో అశ్విన్, టాలెంటెడ్ హీరోయిన్ అవికా గోర్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఓంకార్ తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ చిత్రం మంచి అంచనాల నడుమ థియేటర్లలోనికి వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వెండితెర మీద అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం సంచలనం సృష్టించింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు వస్తున్న టీఆర్పీల దృష్టా.. బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్లో రెండో స్థానాన్ని ఈ చిత్రం పొందింది. మొదటి స్థానంలో ఇస్మార్ట్ శంకర్ 16ప్లస్ రేటింగ్స్ అందుకోగా, ఇప్పుడీ చిత్రం 11.6 రేటింగ్ని సొంతం చేసుకుంది. వెండితెరపై మెప్పించలేకపోయిన ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం కమర్షియల్ హిట్గా నిలిచి బయ్యర్లను సేఫ్జోన్లోకి తీసుకెళ్లింది. బుల్లితెరపై ఈ చిత్రం హిట్ కావడం పట్ల చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
previous post
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీకి 503 సీట్లు..