telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖిని అంతగా బాధపెట్టింది ఎవరు ?

Srimukhi

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. “పటాస్” షోతో యూత్ లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ సరైన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ పైనే దృష్టి సారించింది. అయితే తాజాగా మనుషులలో మానవత్వం చచ్చిపోయిందా ? అంటూ సోషల్ మీడియాలో ఆవేదనను వ్యక్తం చేసింది. “మనుషులలో మానవత్వం చచ్చిపోతోంది. డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. జనం మానవత్వాన్ని మర్చిపోయారా ? గతంలో చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. అయితే నేను వారితో ఏకీభవించలేదు. కానీ నేనిప్పుడు వ్యక్తిగతంగా అనుభవించాను. మనుషులు కలిసి జీవించడానికి డబ్బు మాత్రమే కారణం అన్పిస్తోంది. మనుషులు మానవత్వాన్ని కోల్పోయేలోపు ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యింది. అయితే ఆమెను ఇంతగా బాధించిన విషయమేమిటో మాత్రం బయటపెట్టలేదు ఈ బ్యూటీ.

Related posts