బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ సంచలనంగా మారింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఆరోపణలు గుప్పిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. కాగా ఈ రోజు రియా ఈడీ విచారణకు హాజరైంది. రియా ఆమె సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఆమెపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని రియాను ఆదేశించింది. అయితే, సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరింది. అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, ఈరోజు 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఆమె హాజరైంది. ఇదిలా ఉండగా విచారణ అనంతరం రియాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండాలి భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.
previous post