తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేత పనులకు హైకోర్టు తాత్కాలికంగా హైకోర్టు బ్రేక్ వేసింది. కూల్చివేత పనులను నిలిపివేయాలంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
భవనాల కూల్చివేతతో వాతావరణం కాలుష్యమవుతోందని చెప్పారు. మున్సిపల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.