ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగియగానే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వీలుంది. అయితే ఆ భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ఒకడు హార్దిక్ పాండ్యా. ఈ హిట్టర్ ఓ ఆల్రౌండర్.. అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ సత్తా చాటుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో పాండ్యా కూడా ఒకడు. కానీ, ఈ క్రికెటర్ను కేవలం వన్డేలు, టీ20 సిరీస్లకు మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇపుడు వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో హార్దిక్ పాండ్యా స్వదేశానికి బయలుదేరనున్నాడు. అయితే టీ 20 సిరీస్ లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ”నా దృష్టిలో టీ నటరాజన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్” అని తెలిపాడు. అయితే తాజాగా తన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును నటరాజన్ కు ఇస్తూ నువ్వు దీనికి అర్హుడివి అని తెలిపాడు పాండ్యా. ఇక బుమ్రా లేని సమయంలో యార్కర్లను సంధిస్తూ… ఈ సిరీస్ లో భారత జట్టు తరపున లీడింగ్ వికెట్ టేకర్ గా నటరాజన్ నిలిచాడు. చూడాలి మరి ఈ ఆటగాడు ముందు ముందు ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడు అనేది.
previous post