వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం జగన్ ఇటీవల 1088 అంబులెన్స్ లను ప్రారంభించిన నేపథ్యంలో పవన్ స్పందించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్సులను జగన్ రెడ్డి గారు ప్రారంభించడం అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు.
గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు ప్రజలకు కూడా పవన్ పిలుపునిచ్చారు. ఇది ప్రపంచానికే గడ్డుకాలమని, అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దామని అన్నారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా